లోయలో పడ్డ స్కూల్ బస్సు... తొమ్మిది మంది చిన్నారుల మృతి

Update: 2019-08-06 08:35 GMT

ఉత్తరాఖండ్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. థెహ్రీ గర్వాల్ పట్టణ సమీపంలో ఓ స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. కన్గసాలీ గ్రామ సమీపంలో ఓ మలుపు వద్ద అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో తొమ్మిదిమంది విద్యార్థులు అక్కడికక్కడే చనిపోగా.. మరో పదకొండు మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రమాద సమయంలో బస్సులో 18 మంది చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న ఎస్డీఆర్ఎఫ్ టీం ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు.


Tags:    

Similar News