అర్నాబ్‌ గోస్వామిపై కేసు నమోదు

రిపబ్లిక్ టీవీ ఛానల్ ఎడిటర్, యజమాని అర్నాబ్ గోస్వామిపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు.

Update: 2020-05-04 04:29 GMT

రిపబ్లిక్ టీవీ ఛానల్ ఎడిటర్, యజమాని అర్నాబ్ గోస్వామిపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు.మత విద్వేషాన్ని సృష్టించినట్లు పిడోనీ పోలీస్ స్టేషన్ లో ఆయనపై కేసు నమోదైంది. ఛానల్ మరియు గోస్వామి ముస్లిం సమాజంపై ద్వేషాన్ని సృష్టించడానికి ప్రయత్నించారని, ఏప్రిల్ 14 న జరిగిన వలసదారుల నిరసనకు సంబంధం లేని బాంద్రా నుండి ఒక మసీదును లక్ష్యంగా చేసుకున్నారని ఫిర్యాదుదారు, రాజా ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీ కార్యదర్శి ఇర్ఫాన్ అబూబకర్ షేక్ ఆరోపించారు.

బాంద్రా రైల్వే స్టేషన్ సమీపంలో వలస కూలీలు నిరసన తెలపడానికి వచ్చారు.. అయితే అక్కడికి సమీపంలోని మసీదుకు ఎలాంటి సంబంధం లేదని.. అయితే మసీదు వద్ద ఉన్న ఖాళీ స్థలంలో వలస కూలీలు పెద్ద ఎత్తున చేరిపోయారని. కానీ అర్నాబ్‌ మాత్రం ఆ మసీదు.. మత ఘర్షణలకు యత్నిస్తుందని తన టీవిలో చెప్పారని అబూబకర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

కాగా 'అర్నాబ్ గోస్వామి , రిపబ్లిక్ టీవీ యజమానిపై కేసు నమోదు చేశాము. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది. స్టేట్మెంట్ తీసుకున్న తరువాత సాక్ష్యాలలో భాగంగా.. పెన్ డ్రైవ్‌లోని క్లిప్‌లతో ప్రదర్శనల ఫుటేజీని సాక్ష్యంగా సేకరించాము' అని పైడోనీ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఒక పోలీసు అధికారి తెలిపారు. ఇదిలావుంటే అర్నాబ్ పై భారతీయ శిక్షాస్మృతిలోని 153, 153 ఎ, 295 ఎ, 500, 505 (2), 511 మరియు 120 బి సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్టు తెలుస్తోంది.


Tags:    

Similar News