లడక్లో సైనికులతో ధోనీ.. నేటితో ఆర్మీ డ్యూటీ క్లోస్
దేశవ్యాప్తంగా 73వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. దేశరాజధాని దిల్లీతో పాటు అన్ని రాష్ట్రాలు పంద్రాగస్టు వేడుకలకు ఘనంగా జరిగాయి. ఈ నేపథ్యంలో లద్దాఖ్లో ప్రముఖ క్రికెటర్, భారత సైన్యంలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ యం.ఎస్ ధోనీ లడక్లో సైనికులతో కలిసి జరుపుకున్నాడు.
దేశవ్యాప్తంగా 73వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. దేశరాజధాని దిల్లీతో పాటు అన్ని రాష్ట్రాలు పంద్రాగస్టు వేడుకలకు ఘనంగా జరిగాయి. ఈ నేపథ్యంలో లద్దాఖ్లో ప్రముఖ క్రికెటర్, భారత సైన్యంలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ యం.ఎస్ ధోనీ లడక్లో సైనికులతో కలిసి జరుపుకున్నాడు. ఈ సందర్భంగా సైకికులతో కలిసి కాసేపు సరదాగా ముచ్చటించారు. అనంతరం ఆర్మీ జనరల్ దవాఖానని సందర్శించిన రోగులతో మాట్లాడి వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. కాగా అంతకుముందు ధోని ఆర్మీ బెటాలియన్తో వాలీబాల్ ఆడిన ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టారు. ఇప్పుడు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. లఢక్ పర్యటనలో భాగంగా ధోని పెట్రోలింగ్, గార్డింగ్ సహా పలు విధులు నిర్వర్తించారు. ఈరోజుతో ధోనీ ఆర్మీ డ్యూటీ ముగియనుంది. జులై 30న విధుల్లో చేరిన ధోనీ చేరారు. ఆగష్టు 15వరకూ 106 టీఏ బెటాలియన్(పారా) విభాగంలో ధోనీ సేవలు అందించాడు. పాట్రోలింగ్, గార్డెనింగ్, పోస్ట్ డ్యూటీల విధులు నిర్వర్తించాడు. కాగా వెటరన్ వికెట్ కీపర్-బ్యాట్స్మన్ అయిన ధోనీ రెండు నెలల పాటు విశ్రాంతిలో ఉన్న సంగతి తెలిసిందే.