ఎవరైనా సహించేది లేదు .. మోడీ

Update: 2019-07-02 10:28 GMT

పార్టీకి చెడ్డపేరు తీసుకువచ్చేలా ప్రవర్తిస్తే ఎంతటివారినైనా సహించేది లేదని అన్నారు ప్రధాని మోడీ .. తాజాగా బీజేపి నేత కైలాష్ విజయ్ కుమారుడు మరియు ఎమ్మెల్యే అకాష్ వర్గియా ఇటివల మున్సిపల్ అధికారులపై క్రికెట్ బ్యాట్ తో చేసిన ఘటన వివాదాస్పదం కావడంతో మోడీ ఆగ్రహం వ్యక్తం చేసారు . ఈ రోజు బీజేపి పార్లమెంటరీ సభలో ఈ విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు అయన .. పార్టీ పేరు చెప్పుకొని ఇలాంటి చర్యలకు పాల్పడడం మంచిది కాదని ఇలాంటి పనులు చేసే వారు పార్టీకి అవసరం లేదని వారు ఎవరైనా సరే తప్పించాలని మోడీ స్పష్టం చేసారు . వారికీ మద్దతు ఇచ్చే వారిని కూడా వదిలేది లేదని చెప్పుకొచ్చారు మోడీ ..  

Similar News