ఖైదీ కడుపులో నుంచి ఫోన్‌ రింగ్‌.. పోలీసులు షాక్..

Update: 2019-08-25 05:35 GMT

దేశంలోనే అతిపెద్ద జైలు తీహార్ లో అనుకోని సంఘటన వెలుగులోకి వచ్చింది. ఖైదీ కడుపులోనుంచి ఫోన్ రింగ్ వినబడింది. వివరాల్లోకి వెళితే తీహార్ జైలులో ఖైదీగా ఉంటున్న ఓ వ్యక్తిని కోర్టులో ప్రవేశపెట్టిన తరువాత తిరిగి జైలుకు తీసువచ్చారు.ఈ క్రమంలో అతడిని తనిఖీ చేస్తుండగా ఎక్కడో ఫోన్ రింగ్ టోన్ మోగుతున్న శబ్దం వారికీ వినిపించింది. అది ఎక్కడా అని పోలీసులు వెతుకుతుండగా.. ఖైదీ దగ్గరి నుంచి వస్తోందని గ్రహించారు. అది కూడా అతని కడుపులో నుంచి వస్తోందని తెలుసుకున్నారు. దాంతో అతన్ని విచారించగా అసలు విషయం బయటపెట్టాడు. తాను రహస్యంగా వాడుతున్న అతిచిన్న ఫోన్, దాని ఛార్జర్ ను మింగేశానని వెల్లడించాడు. దీంతో పోలీసులు ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. ఆపరేషన్ చేసి ఆ ఖైదీ కడుపులో నుంచి ఫోనును బయటకు తీసుకువచ్చారు కానీ.. ఛార్జర్ మాత్రం కడుపులోనే ఉండిపోయింది. ఈ ఘటనతో జైలు అధికారులు ఉలికిపాటుకు గురయ్యారు. ఆ ఫోన్ రహస్యంగా అతనికి ఎలా చేరిందన్న దానిపై విచారణ జరుపుతున్నారు.  

Tags:    

Similar News