మంత్రి కేఎస్‌ ఈశ్వరప్ప వ్యాఖ్యలపై పెనుదుమారం

KS Eshwarappa: కర్నాటక అసెంబ్లీని కుదిపేస్తున్న మంత్రి కామెంట్లు

Update: 2022-02-19 02:27 GMT

మంత్రి కేఎస్‌ ఈశ్వరప్ప వ్యాఖ్యలపై పెనుదుమారం

KS Eshwarappa: త్రివర్ణ పతాకం స్థానంలో కాషాయ జెండాను తీసుకొస్తామని, ఏదో ఒక రోజు ఢిల్లీలోని ఎర్రకోటపై కాషాయ జెండా ఎగురుతుందంటూ కర్ణాటక మంత్రి కేఎస్ ఈశ్వరప్ప చేసిన వ్యాఖ్యలపై పెను దుమారం రేగుతోంది. మంత్రి వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. జాతీయ జెండాను అవమానించినందుకు ఈశ్వరప్పపై దేశద్రేహం కేసు నమోదు చేయాలని, మంత్రి పదవి నుంచి తప్పించాలని డిమాండ్‌ చేస్తూ నిరసనకు దిగారు. విధానసభలోనే గురువారం రాత్రి నిద్రపోయారు కాంగ్రెస్ సభ్యులు.

Tags:    

Similar News