మహారాష్ట్రలోని గోండియా దగ్గర ప్రమాదం

Maharashtra: ఒకే ట్రాక్‌పై వెళ్తున్న రెండు ట్రైన్లు ఢీ

Update: 2022-08-17 05:44 GMT

మహారాష్ట్రలోని గోండియా దగ్గర ప్రమాదం

Maharashtra: మహారాష్ట్రలో రైలు ప్రమాదం జరిగింది. ఒకే ట్రాక్‌పై ఒకదాని వెనుక వెళ్తున్న రెండు ట్రైన్లు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. బిలాస్‌పూర్ నుంచి రాజస్థాన్‌లోని కోట ప్రాంతానికి వెళ్తుండగా గోండియా దగ్గర ముందు వెళ్తున్న ట్రైన్‌ను వెనుక నుంచి వస్తున్న మరో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుమారు 50 మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. ఒకే ట్రాక్‌పై రెండు ట్రైన్లు ఢీకొట్టడంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే మరమ్మతులు పూర్తి చేయడంతో రైళ్లు యథాతధంగా వెళ్తున్నాయి. అయితే సిగ్నల్ సమస్య వల్లే రెండు రైళ్లు ఢీకొన్నట్లు అధికారులు చెప్తున్నారు.

Full View


Tags:    

Similar News