కాటేసిన పామును కొరికేశాడు.. చివరకు..

Update: 2019-05-07 15:03 GMT

పాము కరిచిందని ఓ వ్యక్తి పాముపై పగ తీర్చుకోవాలాకున్నాడు.. చివరకు పాము, మనిషి ఇద్దరు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే గుజరాత్‌ రాష్ట్రం మాహిసాగర్ జిల్లా అజన్వా గ్రామంలో రైతు పర్వత్ గాలా బారియా (70) ఉన్నాడు. అయన ప్రస్తుతం మొక్కజొన్న పంట సాగుచేస్తున్నారు. అయితే రెండు రోజులకిందట తన పొలంలో పనిచేసుకుంటుండగా విషపూరిత పాము ఆయనను కాటేసింది. దాంతో ఆ పాముపై పగ తీర్చుకోవాలాకున్నాడు. వెంటనే ఆ పామును కొరికిపారేశాడు. ఈ క్రమంలో మిగిలిన కూలీలు పర్వత్ ను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయగా దురదృష్టవశాత్తు విషప్రభావం ఎక్కువై మధ్యలోనే మృతిచెందారు. కొద్దిసేపటికే ఆ పాము కూడా మరణించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. 

Similar News