ఇంటర్నెట్ రీఛార్జ్ చేయించలేదని ప్రాణాలు తీసుకున్న యువకుడు
ఫోన్ కు ఇంటర్నెట్ రీఛార్జ్ చేయించలేదని తల్లిమీద అలిగిన కొడుకు ప్రాణాలు తీసుకున్నాడు..
ఫోన్ కు ఇంటర్నెట్ రీఛార్జ్ చేయించలేదని తల్లిమీద అలిగిన కొడుకు ప్రాణాలు తీసుకున్నాడు.. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. భోపాల్ కు చెందిన 20 ఏళ్ల వ్యక్తికి చెందిన మొబైల్ ఇంటర్నెట్ కాలపరిమితి ముగిసింది. దాంతో మొబైల్ ఫోన్ను రీఛార్జ్ చేసుకోవడానికి తల్లిదండ్రులను డబ్బులు అడిగాడు.. వారు నిరాకరించారు.
ఈ క్రమంలో అతను తన ఫోన్ రీఛార్జ్ చేయమని తన తల్లిని నిరంతరం అడుగుతున్నారని, కాని ఆమె అందుకు నిరాకరించారని ఈ క్రమంలో అతను తల్లిమీద అలిగి బలవన్మరణానికి పాల్పడ్డాడని ప్రముఖ వార్త ANI నివేదించింది. ఈ మేరకు బాగ్సేవానియా పోలీస్ స్టేషన్ ఇంచార్జి ఎస్ శర్మ ఈ విషయాన్నీ వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు శర్మ తెలిపారు.