కోల్‌‌కతాలో బాంబుల కలకలం

* ఎంటాలీ ప్రాంతంలో 22 క్రూడ్ తరహా బాంబుల గుర్తింపు * ఆందోళన వ్యక్తం చేసిన సీఎం మమతా బెనర్జీ

Update: 2021-01-03 04:26 GMT

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌ కతాలో బాంబులు కలకలం రేపాయి. జన సంచారం ఎక్కువగా ఉండే ఎంటాలీ ప్రాంతంలో 22 క్రూడ్ తరహా బాంబులను గుర్తించారు పోలీసులు. నగర మిలిటరీ ఇంటిలిజెన్స్‌ ఇచ్చిన సమాచారంతో ఎంటాలీకి వెళ్లిన పోలీసులు నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో బాంబులను గుర్తించారు. దీంతో ఈ విషయంపై సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు రానున్న తరుణంలో ఇలాంటి ఘటనలు వెలుగుచూడటంపై ఆందోళన వ్యక్తం చేశారు. 

Tags:    

Similar News