కేంద్ర ప్రభుత్వంపై మమత బెనర్జీ పోరాటం

Mamata Banerjee: బీజేపీయేతర సిఎంలు, ప్రతిపక్ష నేతలకు మమత లేఖ

Update: 2022-03-29 09:16 GMT

కేంద్ర ప్రభుత్వంపై మమత బెనర్జీ పోరాటం

Mamata Banerjee: కేంద్ర ప్రభుత్వంపై ఇప్పటికే యుద్దం చేస్తున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ మరో అస్త్రం సంధించారు.బీజేపీ యేతర పాలిత రాష్ట్రాల సీఎంలు, ప్రతిపక్ష రాజకీయ పార్టీల నేతలకు మమత బెనర్జీ లేఖ రాశారు. దేశవ్యాప్తంగా బిజెపికి వ్యతిరేకంగా ఏకం కావాలని లేఖలో మమత కోరారు. ప్రతిపక్ష పార్టీలను వేధించేందుకు కేంద్రం దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుంటోందని లేఖలో ప్రస్తావించారు. బిజెపి ప్రతీకార రాజకీయాలపై త్వరలో సమావేశం కావాలని మమత పిలుపు ఇచ్చారు.

Tags:    

Similar News