Madhya Pradesh Police: ఖాండ్వా జిల్లాలో పోలీసుల దాష్టీకం

Madhya Pradesh Police: కోవిడ్ పేషంట్‌పై లాఠీలు ఝుళిపించిన పోలీసులు * సోషల్‌మీడియాలో వైరల్‌గా మారిన వీడియో

Update: 2021-04-12 06:02 GMT

కోవిడ్ పేషెంట్ పై పోలీసుల దాడి 

Madhya Pradesh Police: మధ్యప్రదేశ్‌ లోని ఖాండ్వా జిల్లాలో పోలీసుల తీరు విమర్శలకు దారి తీస్తోంది. 20 ఏళ్ల కొవిడ్ పేషంట్‌పై విచక్షణారహితంగా దాడి చేశారు. బంజారీ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ 20 ఏళ్ల యువకుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవగా..క్వారంటైన్‌లో ఉంచాలని సూచించారు ఆరోగ్య కార్యకర్తలు. దీంతో పేషంట్‌ కుటుంబం వారిపై దాడి చేసింది. ఈ ఘటనలో ఆరోగ్య కార్యకర్తలు గాయపడ్డారు. దీంతో ఆగ్రహించిన పోలీసులు.. ఆ పేషంట్‌ను ఇంటికి వెళ్లి మరీ చితకబాదారు. అడ్డొచ్చిన కుటుంబ సభ్యులపై కూడా లాఠీ ఝుళిపించారు.

ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ కావడంతో పోలీసుల తీరుపై విమర‌్శలు వెల్లువెత్తాయి. అయితే పోలీసు అధికారులు మాత్రం పేషంట్ కుటుంబం దాడి చేసే ప్రయత్నం చేయడం వల్లే పోలీసులు వెంటనే లాఠీఛార్జ్ చేశామని పోలీసులు చెప్పారు.  

Tags:    

Similar News