ఢిల్లీ మెట్రో ముందు 2కిలోమీటర్ల క్యూ.. చూక్కలు చూపిస్తున్న నయా ఆంక్షలు

Delhi: ఒమిక్రాన్‌ నేపధ్యంలో అమల్లోకి వచ్చిన ఆంక్షలపై ఢిల్లీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Update: 2021-12-29 10:39 GMT

ఢిల్లీ మెట్రో ముందు 2కిలోమీటర్ల క్యూ.. చూక్కలు చూపిస్తున్న నయా ఆంక్షలు 

Delhi: ఒమిక్రాన్‌ నేపధ్యంలో అమల్లోకి వచ్చిన ఆంక్షలపై ఢిల్లీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఢిల్లీలో నైట్‌కర్ఫ్యూతో పాటు కాలేజ్‌లు, జిమ్‌లు, సినిమా హాళ్లను మూసివేశారు. ఇక రైళ్లు, బస్సులను 50శాతం సామర్ధ్యంతో మాత్రమే నడపాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ నిబంధనలతో మెట్రో స్టేషన్ల దగ్గర కిలోమీటర్ల కొద్దీ జనం బారులు తీరి కనిపించారు. ప్రభుత్వ ఆంక్షలతో వెళ్లాల్సిన సమయం కంటే 2 గంటల ముందే ఇంటి నుంచి బయల్దేరాల్సి వస్తుందని ప్రయాణికులు వాపోతున్నారు.

Tags:    

Similar News