ఉల్లి సంక్షోభాన్ని పరిష్కరించేందుకు కేంద్ర ప్రయత్నిస్తోంది : నిర్మలా సీతారామన్
సామాన్యుడి కంట కన్నీరు తెప్పిస్తున్న ఉల్లి అంశం లోక్సభలో చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. ఉల్లిపాయలు, వెల్లుల్లి ఎక్కువగా తినను మీరు చింతించకడి. ఆ రెండింటితో పెద్దగా సంబంధం లేని కుటుంబం నుంచి వచ్చానంటూ సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై విపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశంలో ఉల్లి సంక్షోభాన్ని పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, దీనిలో భాగంగానే విదేశాల నుండి ఉల్లిని దిగుమతి చేసుకుంటున్నామని ఆమె వెల్లడించారు. ధరలను అదుపులో ఉంచేందుకు ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించామని ఆమె వివరించారు.