లాక్ డౌన్ ని పొడిగిస్తూ సడలింపుల్లో భాగంగా వైన్ షాపులు తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనితో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో మద్యం షాపులు తెరుచుకున్నాయి. మందుబాబులు మద్యం దుకాణాల ముందు బారులు తీరారు. కరోనా వ్యాప్తి చెందకుండా కనీస దూరం పాటించాలన్న నిబంధనను సైతం పక్కన పెట్టేశారు. ఇదిలా ఉంటే బెంగళూరులో ఓ వ్యక్తి దాదాపుగా రూ.50వేల మద్యంను కొనుగోలు చేశాడు, మరో వ్యక్తి దాదాపు రూ.లక్ష విలువ చేసే మద్యం బాటిళ్లను కొనుగోలు చేశాడు. దీనికి సంబంధించిన బిల్ పేపర్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.