Tamilnadu: ఖుష్బూ దోశ.. స్మృతి ఇరానీ దాండియా

Tamilnadu: థౌజండ్ లైట్స్ నియోజక వర్గంలో ఖుష్బూ దోశ వేశారు.

Update: 2021-03-27 13:03 GMT

కుష్బూ 

Tamilnadu: తమిళనాడులో ఎన్నికల ప్రచారం జోరందుకుంటోంది. సినీ నటి ఖుష్బు పోటీ చేస్తున్న థౌజండ్ లైట్స్ నియోజక వర్గంలో పోటా పోటీగా ప్రచారం సాగుతోంది. పేదలు, సామాన్యుల ఓట్లను అభ్యర్ధించేందుకు ఖుష్బు సైతం దోశె వేసి ఆకట్టుకున్నారు. .తనను గెలిపించాలంటూ అక్కడ సందడి చేశారు.‌ఖుష్బు ఎన్నికల ప్రచారాన్ని చుట్టు పక్కల వారు చాలా ఆసక్తిగా గమనించారు. థౌజండ్ లైట్స్ నియోజక వర్గం నుంచి తన గెలుపు ఖాయమని ఆమె అంటున్నారు. ఇక కోయంబ‌త్తూరులో ప్ర‌చారం నిర్వ‌హించేందుకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వెళ్లారు. అక్క‌డ ఆమె బీజేపీ కార్య‌క‌ర్త‌ల‌తో దాండియా ఆడారు. కోయంబ‌త్తూరు సౌత్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌న‌తి శ్రీనివాస‌న్ పోటీ చేస్తున్నారు. ఇక ఓ స్వ‌తంత్య్ర అభ్య‌ర్థి చెపాక్‌లో వెరైటీ క్యాంపేన్ చేశారు.


Tags:    

Similar News