ప్రధానితో సీఎంల సమావేశానికి కేరళ సీఎం పినరయ్ విజయన్ డుమ్మా

Update: 2020-04-27 06:48 GMT

అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్ర‌ధాని మోదీ వీడియోకాన్ఫ‌రెన్స్ నిర్వ‌హిస్తున్నారు. కోవిడ్‌19 నేప‌థ్యంలో తీసుకోవాల్సిన చ‌ర్య‌ల గురించి సీఎంల‌ను అడిగి తెలుసుకుంటున్నారు. వైరస్ ఉధృతి కొనసాగుతున్న తరుణంలో మెజార్టీ రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను కొనసాగించాలని పట్టుపడుతున్నాయి. మే 3 తరువాత కూడా లాక్‌డౌన్‌ను కొనసాగించాలని ఈ సందర్భంగా మోదీని కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కోరారు.

ఇదిలా ఉండగా కేరళ సీఎం పినరయ్ విజయన్ మాత్రం ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్‌కు దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆ రాష్ట్రం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమావేశంలో పాల్గొన్నారు. వైరస్ కట్టిడికి కేరళ రాష్ట్రం తరపున సలహాలను ఇప్పటికే రాతపూర్వకంగా కేంద్రానికి ఇచ్చినందున సీఎం సమావేశానికి హాజరు కావడం లేదని ప్రకటన చేసింది ఆ రాష్ట్రం.

Tags:    

Similar News