ఈసారి వైద్యులకే భారతరత్న ఇవ్వాలి: కేజ్రీవాల్

కోవిడ్ సంక్షోభంలో ప్రాణాలకు తెగించి పోరాడారు అవసరమైతే నిబంధనల్లో మార్పులు చేయాలి ప్రధాని మోడీకి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ లేఖ

Update: 2021-07-04 16:09 GMT

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ (ఫోటో : ది హిందూస్తాన్ టైమ్స్)

Arvind Kejriwal: కొవిడ్‌ మహమ్మారి వ్యాప్తి సమయంలో తమ జీవితాలను, కుటుంబాలను పక్కన పెట్టి వైద్యులు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు సేవలందించారని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. వారి సేవలకు గుర్తింపుగా దేశ అత్యున్నత భారతరత్న పురస్కారాన్ని ఈసారి వైద్యులకే ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేస్తూ ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఈ పురస్కారం కొవిడ్‌ సమయంలో విశేష సేవలందించిన వారందరికీ దక్కాలనీ, అవసరమైతే నిబంధనల్లో మార్పులు చేయాలని ప్రధానికి సూచించారు.

Tags:    

Similar News