Hijab Controversy: నేడు హిజాబ్ వివాదంపై తీర్పు

Hijab Controversy: విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన సర్కార్

Update: 2022-03-15 03:15 GMT

 నేడు హిజాబ్ వివాదంపై తీర్పు

Hijab Controversy: హిజాబ్ కేసుపై నేడు కర్ణాటక హైకోర్టు తీర్పు వెలువరించనుంది. ఈ నేపథ్యంలో బెంగళూరులో ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడకుండా వారం పాటు ప్రభుత్వం నిషేధం విధించింది. అలాగే ఉడిపితోపాటు పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.

స్కూళ్లు, కాలేజీల్లో హిజాబ్ నిషేధాన్ని సవాల్ చేస్తూ ఉడిపికి చెందిన పలువురు విద్యార్థినులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రీతూరాజ్ అవస్థి నేతృత్వంలోని ధర్మాసనం ఇప్పటికే వాదనలు వింది. ఇక హిజాబ్, వ్యతిరేక వర్గాలు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తుండటంతో హిజాబ్ అంశంపై కర్ణాటకలో దుమారం రేగింది.

Tags:    

Similar News