JP Nadda: శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న జేపీ నడ్డా
JP Nadda: కాసేపట్లో పార్టీ నేతలతో జేపీ నడ్డా సమావేశం
JP Nadda: శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న జేపీ నడ్డా
JP Nadda: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న జేపీ నడ్డాకు తెలంగాణ బీజేపీ నేతలు స్వాగతం పలికారు. ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ కె నాగేశ్వర్, ప్రముఖ కొరియోగ్రాఫర్, పద్మశ్రీ గ్రహీత ఆనంద శంకర్లను కలవనున్నారు. తర్వాత తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలతో జేపీ నడ్డా సమావేశం కానున్నారు. అనంతరం జేపీ నడ్డా.. హైదరాబాద్ నుంచి నాగర్కర్నూల్కు చేరుకుంటారు. నవ సంకల్ప సభలో ఆయన పాల్గొననున్నారు. రాత్రి 7.40 గంటల సమయంలో శంషాబాద్ విమానాశ్రయం నుంచి కేరళ రాజధాని తిరువనంతపురంకు వెళ్లనున్నారు.