పేద పిల్లలకి ఫైవ్ స్టార్ హోటల్ లో డిన్నర్ ఇచ్చారు ఓ మంత్రి.. డిన్నర్ ఇవ్వడమే కాదు ఆ పిల్లలకి మంచి బట్టలు కొనిచ్చి , గిఫ్ట్ లు కూడా ఇచ్చాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో చోటు చేసుకుంది. ఆ మంత్రి పేరు జీతు పట్వారీ.. దీపావళి పండుగ సందర్భంగా పేద పిల్లలను బస్సులో తీసుకుని వెళ్లి ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో వారికీ రకరకాల వంటకాలతో కూడిన డిన్నర్ ని అందించారు. అందించడమే కాదు.. భయపడుతున్న కొందరు పిల్లలకు తానే స్వయంగా వడ్డించి తినిపించారు. వారికీ ఏమేమి కావాలో హోటల్ యజమాన్యాన్ని అడిగి మరి తెప్పించారు.. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి. మంత్రి చేసిన ఈ పనికి నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తూ అభినందిస్తున్నారు.
Madhya Pradesh: State Minister Jitu Patwari organised a lunch for underprivileged children at a five star hotel in Indore on the occasion of #Diwali pic.twitter.com/yZ5fKfDotD
— ANI (@ANI) October 27, 2019