శ్రీనగర్‌లో ఉగ్రమూకల గ్రనేడ్ దాడి

Update: 2019-11-04 11:40 GMT
Jammu and Kashmir

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. అక్టోబర్‌ 28న ఉత్తర కశ్మర్‌లోని మరోసారి గ్రనేడ్ దాడితో 19మంది గాయపడిన సంగతి తెలిసిదే. 15 రోజుల వ్యవధిలో ఇది రెండోసారి గ్రనేడ్ దాడి చేశారు. శ్రీనగర్‌లోని మౌలానా ఆజాద్ రోడ్‌లోని మార్కెట్‌లో సోమవారం ముష్కరులు గ్రనేడ్ దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో 15 మందికి గాయాలైయ్యాయి పోలీసులు వెల్లడించారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. 

ఇటీవలే కశ్మీర్ లో బ్రిటన్ బృందం పర్యటనకు ముందు రోజు సొపోర్ లోని ప్లాజాలో ముష‌్కరమూకలు భీకర దాడికి పాల్పడ్డాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉగ్ర శిబిరాలపై భారత్ దాడులు చేయడంతో కశ్మర్‌లో ఉగ్రవాదులు అలజడులు సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని సైన్యం పేర్కొంది.  

Tags:    

Similar News