వచ్చే నెలలో భారత పర్యటనకు ఇజ్రాయెల్ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్

Naftali Bennett - India Tour: *మోదీ ఆహ్వానం మేరకు భారత్ వస్తున్న బెన్నెట్ * ఏప్రిల్ 3 నుంచి 5 వరకు బెన్నెట్ పర్యటన

Update: 2022-03-22 09:07 GMT

వచ్చే నెలలో భారత పర్యటనకు ఇజ్రాయెల్ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్

Naftali Bennett - India Tour: ఇజ్రాయెల్ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్ వచ్చే నెలలో భారత పర్యటనకు వస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు బెన్నెట్ ఏప్రిల్ ఏప్రిల్ 3 నుంచి 5 వరకు భారతదేశంలో పర్యటించనున్నారు. గత ఏడాది గ్లాస్తోలో జరిగిన COP 26 సదస్సులో మోడీ-బెన్నెట్ కలుసుకుని పలు అంశాలపై మాట్లాడుకున్నారు. అప్పుడే మోడీ బెన్నెట్ ను భారత్ పర్యటనకు రావాల్సిందిగా కోరారు.

ఇజ్రాయెల్ ప్రధాని హోదాలో భారత పర్యటనకు రావడం బెన్నెట్ కు ఇదే తొలిసారి. భారత్- ఇజ్రాయెల్ మధ్య దౌత్య సంబంధాలు 30 సంవత్సరాల పూర్తయిన సంధర్భంగా ఈ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది..వ్యవసాయం, నీరు, వాణిజ్యం, విద్య, శాస్త్ర సాంకేతిక రంగాలతో సహా విభిన్న రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు బెన్నెట్ పర్యటన ఉపయోగపడుతుంది.

Tags:    

Similar News