కర్ణాటకలో రాజకీయ రసవత్తరంగా మారింది. తాజా రాజకీయాలపై గవర్నర్ను కలిసారు యడ్యూరప్ప.. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు తమన ఆహ్వానించాలని కోరారు. అంతకు ముందు మైనార్టీలో పడిపోయిన ప్రభుత్వం దిగిపోవాలని బీజేపీ నేతలు విధాన సభ ఎదుట ఆందోళనకు దిగారు. సీఎం పదవికి కుమారస్వామి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు బెంగుళూరులో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కర్ణాటకలో రాజకీయ సంక్షోభానికి బీజేపీనే కారణమని ఆరోపించారు. ఇటు లోక్ సభలోనూ కాంగ్రెస్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. ముంబైలో రెబెల్ ఎమ్మెల్యేలు ఉన్న హోటల్ వద్ద పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.