ఈశాన్య రాష్ట్రాల్లో కుండపోత వానలు

Heavy Rain: 5 రాష్ట్రాల్లో ఎడతెరపి లేకుండా జోరుగా వానలు

Update: 2022-08-21 07:48 GMT

ఈశాన్య రాష్ట్రాల్లో కుండపోత వానలు 

Heavy Rain: ఈశాన్య రాష్ట్రాల్లో కుండపోతగా కురుస్తున్న వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దేశంలోని 5 రాష్ట్రాల్లో కురుస్తున్న వానలకు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. గత 24 గంటల్లో ఎడ తెరపిలేకుండా కురుస్తున్న వర్షాలకు వరదలు పోటెత్తుతున్నాయి. కొండచరియలు విరిగిపడడంతో దాదాపు 37 మంది మృత్యువాతపడ్డారు. మరికొందరి ఆచూకీ గల్లంతైంది. హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూకశ్మీర్, ఒడిశా, జార్ఘండ్ రాష్ట్రాల్లో జన జీవనం అస్తవ్యస్తమైంది. కొండ ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడడంతో వేలమంది ఇళ్లకే పరిమితం అయ్యారు.

Tags:    

Similar News