Arvind Kejriwal: నేడు ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్పై విచారణ
Arvind Kejriwal: ఈడీ అరెస్ట్, రిమాండ్ను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ పిటిషన్
Arvind Kejriwal: ఇవాళ ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్పై విచారణ జరగనుంది. లిక్కర్ స్కాం కేసులో ఈడీ అరెస్ట్, రిమాండ్ను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఈ పిటిషన్పై విచారణ చేపట్టనున్నారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కాం కేసులో ఈ నెల 21న కేజ్రీవాల్ను ఈడీ అరెస్టు చేసింది. మనీల్యాండరింగ్కు పాల్పడ్డారని ఆభియోగాలు మోపింది. రెండేళ్ల క్రితం ఎక్సైజీ పాలసీ అమలులో భాగంగా కాంట్రాక్టర్ల వద్ద నుంచి కేజ్రీవాల్ సుమారు 100 కోట్లు ముడుపులు తీసుకున్నారని ఈడీ ఆరోపించింది.