హరియాణా బీజేపీ అధ్యక్షుడి రాజీనామా
హరియాణా బీజేపీ అధ్యక్షుడు సుభాష్ బరాలా తన పదవికి రాజీనామా చేశారు. గురువారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో సంపూర్ణ మెజార్టీ రాకపోవడంపై నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు.
హరియాణా బీజేపీ అధ్యక్షుడు సుభాష్ బరాలా తన పదవికి రాజీనామా చేశారు. గురువారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో సంపూర్ణ మెజార్టీ రాకపోవడంపై నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముఖ్య నేతలకు అమిత్ షా తాఖీదులు జారీ చేయడంతో సుభాష్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు కూడా కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమన్ల జారీ చేశారు. తోహానా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఖట్టర్ ఓట్ల లెక్కింపులో ప్రత్యర్థి అభ్యర్థి కంటే వెనుకంజ లో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్లు కూడా ఏ పార్టీకి స్పష్టమైన మెజారీటీ ఇవ్వలేదు. అయితే హరియాణా హంగ్ దిశగా మారింది.