Pran Pratistha: ఈనెల 22న హాఫ్ డే హాలిడే ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
Pran Pratistha: 22న మ.2.30 గంటల వరకు సెలవు ఇస్తున్నట్టు ప్రకటన
Pran Pratistha: అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలకు హాలిడే ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఈనెల 22న రామ విగ్రహ ప్రతిష్టాపన నేపథ్యంలో.. హాఫ్ డే హాలిడే ప్రకటించింది ప్రభుత్వం. అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఆరోజు మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల వరకు సెలవు ఇస్తూ నోటీస్ విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వినతుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.