Goa: కాంగ్రెస్‌కు బిగ్‌ షాక్‌.. మాజీ సీఎం సహా బీజేపీలో చేరనున్న 8 మంది ఎమ్మెల్యేలు

Goa: గోవాలో హస్తం పార్టీకి బిగ్‌ షాక్‌ తగిలింది.

Update: 2022-09-14 07:18 GMT

Goa: కాంగ్రెస్‌కు బిగ్‌ షాక్‌.. మాజీ సీఎం సహా బీజేపీలో చేరనున్న 8 మంది ఎమ్మెల్యేలు

Goa: గోవాలో హస్తం పార్టీకి బిగ్‌ షాక్‌ తగిలింది. కాంగ్రెస్‌కు 8 మంది ఎమ్మెల్యేలు గుడ్‌ బై చెప్పారు. ఆ పార్టీకి చెందిన మాజీ ముఖ్యమంత్రి సహా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరనున్నారు. వారంతా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్‌, అసెంబ్లీ స్పీకర్‌ను కలిశారు. ఈ మేరకు పార్టీ వర్గాలు మీడియాకు వెల్లడించాయి. ఎనిమిది మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరనున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సదానంద్‌ షెట్ తెలిపారు. వారిలో మాజీ సీఎం దిగంబర్‌ కామత్‌, మిచెల్‌ లోబో, డెలిలాహ్‌ లోబో, రాజేశ్‌ ఫల్‌దేశాయ్‌, కేదార్‌ నాయక్‌, సంకల్ప్‌ అమోన్కర్‌, అలెక్సియో సెక్వీరియ, ఉడాల్ఫ్‌ ఫెర్నాండేస్‌ ఉన్నారు.

Tags:    

Similar News