Arvind Kejriwal: ఎన్ని సమన్లు పంపితే అన్ని పాఠశాలలు ఓపెన్ చేస్తా
Arvind Kejriwal: విద్యార్థులకు న్యాయమైన విద్యను అందిస్తాం
Kejriwal: ఎన్ని సమన్లు పంపితే అన్ని పాఠశాలలు ఓపెన్ చేస్తా
Arvind Kejriwal: ఢిల్లీలోని విద్యార్థులందరికీ న్యాయమైన విద్యను అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తేల్చిచెప్పారు. దర్యాప్తు సంస్థలు తనకు ఎన్ని సమన్లు పంపాయో.. ఢిల్లీ నగరంలో అన్ని పాఠశాలలను తెరుస్తానని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. కేంద్రం పరిధిలోని అన్ని దర్యాప్తు సంస్థలన్నింటినీ తనపైకి బీజేపీ ప్రభుత్వం ఉసిగొల్పుతుందన్నారు. విద్యార్థులందరికీ నాణ్యమైన విద్యను అందించి, పేదరికాన్ని రూపుమాపుతామన్నారు.