కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. నలుగురు ఉగ్రవాదుల హతం

Update: 2020-06-08 03:43 GMT

జమ్ముకశ్మీర్‌లో భద్రతాదళాల కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. షోపియాన్‌ జిల్లా పింజోరా ప్రాంతంలో ఉగ్రవాదులున్నారని సమాచారం మేర సోమవారం షోపియాన్ పోలీసులు సైనికులతో కలిసి గాలింపు చేపట్టారు. సైనికులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో సైనికులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు మరణించారు.

ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు కూడా గాయపడ్డారు. పింజోరాకు 12 కి.మీ దూరంలో ఉన్న రెబన్‌ ప్రాంతంలో హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ ఉగ్రసంస్థకు చెందిన ఐదుగురు ఉగ్రవాదులను ఆదివారం భద్రతా దళాలు మట్టుబెట్టిన విషయం తెలిసిందే. మృతుల్లో ఓ హిజ్బుల్‌ కమాండర్‌ కూడా ఉన్నాడు. ఆదివారం తెల్లవారుజామున ప్రారంభమైన ఎన్‌కౌంటర్‌ సుమారు 12 గంటలపాటు కొనసాగిందని అధికారులు తెలిపారు.

Tags:    

Similar News