అమెరికాలో నలుగురు తెలుగువారి మృతి

Update: 2019-06-17 00:47 GMT

అమెరికా అయోవా రాష్ట్రంలో దారుణం జరిగింది. తెలుగు కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. సుంకర చంద్రశేఖర్, సుంకర లావణ్య, మరో ఇద్దరు చిన్నారులు తమ ఇంట్లో చనిపోయి ఉన్నారు. పరిసరాలను బట్టి చూస్తే కాల్పుల్లో చనిపోయినట్టు కనిపిస్తోంది. చంద్రశేఖర్ మానసిక ఒత్తిడి వల్ల కుటుంబాన్ని చంపి తాను ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ముగ్గురిని కాల్చిన తర్వాత చంద్రశేఖర్ తనను తాను కాల్చుకుని ఉంటాడని భావిస్తున్నారు. కొంతకాలంగా చంద్రశేఖర్ మానసిక ఒత్తిడిలో ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు. 

Tags:    

Similar News