రేపు ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఫలితాలు

*ఊపందుకున్న క్యాంప్, పొత్తు రాజకీయాలు

Update: 2022-03-09 07:33 GMT

రేపు ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఫలితాలు

Five States Election Results: రేపు ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో క్యాంప్‌, పొత్తు రాజకీయాలు ఊపందుకున్నాయి. ఆయా రాష్ట్రాలకు పలు పార్టీలు సీనియర్‌ నేతలను పంపిస్తున్నాయి. ప్రత్యేకించి గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్‌లకు సీనియర్ నేతలు పంపించాయి పార్టీలు. ఇక పోటీ చేసిన అభ్యర్థులందరినీ ఒక చోటకు చేరుస్తున్నాయి ఆయా పార్టీలు. రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీ క్యాంప్‌లు ఏర్పాటు చేస్తోంది. జైపూర్‌లో క్యాంప్‌ల ఏర్పాటుపై సీఎం అశోక్‌ గెహ్లాట్‌తో చర్చించారు ప్రియాంకగాంధీ. మణిపూర్, గోవా, ఉత్తరాఖండ్‌లో చిన్న పార్టీలతో బీజేపీ, కాంగ్రెస్‌లు సంప్రదింపులు చేస్తున్నాయి. యూపీ ఎన్నికల్లో తమ పార్టీ గెలుపుకోసం పార్టీ సీనియర్ నేతలు శ్రమిస్తున్నారు.

Tags:    

Similar News