కూలీల కుటుంబాల బాధను తీర్చలేం

కశ్మీర్ లో ఉగ్రవాదుల జరిపిన కాల్పుల్లో ఐదుగురు కూలీలు మృతి చెందారు. దీనిపై పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

Update: 2019-10-30 07:41 GMT

కశ్మీర్ లో ఉగ్రవాదుల జరిపిన కాల్పుల్లో ఐదుగురు కూలీలు మృతి చెందారు. దీనిపై పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఉగ్రవాదుల కాల్పుల్లో మృతి చెందిన కూలీల కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కూలీల కుటుంబాల బాధను ఎవరు తీర్చలేరని అన్నారు. వారి కుటుంబాలకు అన్ని విధాలా అదుకుంటామని మమతా బెనర్జీ ట్విటర్‌లో పేర్కొన్నారు.

మంగళవారం కుల్గాంలో ఉగ్రవాదుల కాల్పులకు తెగబడ్డారు. ముష‌్కరుల కాల్పుల్లో ముర్షిదాబాద్‌కు చెందిన ఐదుగురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. మరో కూలీ తీవ్రంగా గాయపడిన చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.


 


Tags:    

Similar News