ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం : మెట్రో సేవలు బంద్

Update: 2019-06-21 05:55 GMT

 ఢిల్లీలో నేటి ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కలిందికుంజ్ మెట్రో స్టేషన్ సమీపంలో ఫర్నిచర్ మార్కెట్లో శుక్రవారం ఉదయం మంటలంటుకున్నాయి. పెద్దఎత్తున్నఎగిసిపడ్డాయి. స్థానికుల సమాచారంతో హుటాహుటినా ఘటనాస్థలికి చేరుకున్న 17 ఫైరింజన్లు మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నాయి. అయితే అగ్నిప్రమాదం కారణంగా కళిందికుంజ్ - జశోలా విహార్ షాహీన్ బాగ్ మధ్య మెట్రో సర్వీసులను నిలిపివేశారు. ఈ మెట్రో మార్గం కిందనే అగ్నిప్రమాదం జరిగింది. ప్రాధమిక సమాచారం మేరకు ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. 

Tags:    

Similar News