యూపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చత్తీస్‌గఢ్ సీఎంపై కేసు

ఎన్నికల ప్రచారం ఎలా సాగించాలో ఈసీ డెమో ఇవ్వాలని విన్నపం

Update: 2022-01-18 01:11 GMT

యూపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చత్తీస్‌గఢ్ సీఎంపై కేసు

Bhupesh Baghel: కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి యూపీలో ఎన్నికల ప్రచారం సాగించిన చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్‌పై గౌతమ్‌బుధ్ నగర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ పరిణామంపై భూపేష్ బాఘెల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారం ఎలా సాగించాలో ఎన్నికల కమిషన్ డెమో ఇవ్వాలన్నారు. అహ్రోహలో 5 రోజుల నుంచి బీజేపీ ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తోందని సీఎం భూపేష్ ఆరోపించారు. వాళ్లపై ఎందుకు చర్య తీసుకోలేదని నిలదీశారు. ఈసీ నిష్పాక్షికంగా ఉండాలన్నారు. ఇలా అయితే ప్రచారం సాగించేదెలా అని అన్నారు. అమ్రోహిలో బీజేపీ నేతలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయరా అని ఈసీని ప్రశ్నించారు. ? 

Tags:    

Similar News