సీనియర్ తమిళ సినీ నటులు శరత్కుమార్, రాధారవి లను అరెస్టు చేయాలని మద్రాసు హైకోర్టు సూచింది. ఈ మేరకు పోలీసులకు ఉత్తర్వులు జారీ చేసింది. సినీ నటీనటుల సంఘానికి శరత్కుమార్ అధ్యక్షుడిగా, రాధారవి కార్యదర్శిగా గతంలో ఉన్నారు. ఆ సమయంలో కాంచీపురం జిల్లా పరిధిలోని వెంకటామంగళంలో ఉన్న నటీనటుల సంఘానికి చెందిన స్థలాన్ని వీరిద్దరు ఆక్రమించి అమ్మేశారని 2017లో ఓ వ్యక్తి మద్రాసు హైకోర్టులో పిటిషన్ను దాఖలు చేశారు. అయితే మద్రాసు హైకోర్టు శనివారం విచారించింది. సంఘం అనుమతి లేకుండా స్థలాన్ని విక్రయించిన ఈ కేసును 3నెలల్లో తేల్చి చర్యలు తీసుకోవాలని, శరత్, రవిలను అరెస్టు చేయాలని పోలీసులను ఆదేశించింది మద్రాసు హైకోర్టు.