జియో 498 ఉచిత రీఛార్జ్.. ఫేకా.. ఒరిజినలా?
కేంద్రం లాక్డౌన్ ప్రకటించడంతో జియోకు సంబంధించిన సోషల్ మీడియా పోస్ట్ ఒకటి వైరల్ గా మారింది.
కేంద్రం లాక్డౌన్ ప్రకటించడంతో జియోకు సంబంధించిన సోషల్ మీడియా పోస్ట్ ఒకటి వైరల్ గా మారింది.వాట్సాప్లో చాలా మందికి ఆ లింక్ షేర్ అయింది. లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలు ఇంటివద్దే ఉంటుండటంతో 498 రూపాయలు ఉచిత రీఛార్జిగా జియో ఇస్తున్నట్టు ఆ లింక్ సారాంశం. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో కొందరు వినియోగదారులు హిందీలో ఇలా పేర్కొన్నారు,' ఈ సంక్షోభ సమయంలో, జియో 498 రూపాయల ఉచిత రీఛార్జిని అందిస్తోంది.
ఉచిత రీఛార్జిని పొందడానికి క్రింది లింక్ను క్లిక్ చేయండి. ఈ ఆఫర్ మార్చి 31 వరకు మాత్రమే చెల్లుతుంది.' అని సామాజిక మాధ్యమాల్లో వార్త ఫేక్ వార్త వైరల్ అయింది. దీంతో చాలా మందికి ఈ లింక్ షేర్ అవ్వడంతో కొందరు విశ్వసించరు. అయితే దీనిపై జియో ఇంకా వివరణ ఇవ్వలేదు కానీ.. ఈ వార్తకు సంబంధించి ఎటువంటి సమాచారం జియోకు చెందిన అధికారిక వెబ్సైటు లో లేదు. దాంతో ఈ వార్త ఫేక్ అని అర్ధమవుతోంది.