Arvind Kejriwal: ఈడీ విచారణ... కేజ్రీవాల్ హాజరుపై ఉత్కంఠ

Arvind Kejriwal: ఢిల్లీ జల్‌బోర్డ్ స్కాంలో విచారణకు రావాలని ఆదేశం

Update: 2024-03-18 04:16 GMT

Arvind Kejriwal: ఈడీ విచారణ... కేజ్రీవాల్ హాజరుపై ఉత్కంఠ 

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్‌కు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఢిల్లీ జల్‌బోర్డులో చోటు చేసుకున్న అవకతవకలకు సంబంధించిన కేసులో ఇవాళ ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని పేర్కొన్నారు. పీఎంఎల్​యాక్ట్ కింద కేజ్రీవాల్​పై ఇప్పటికే ఈడీ కేసు రిజిస్టర్ చేసింది. మరోవైపు ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈడీ తొమ్మిదోసారి కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేసింది.

ఈ నెల 21న ఈడీ హెడ్ ఆఫీస్​లో విచారణకు హాజరుకావాలని సమన్లలో పేర్కొంది. లిక్కర్‌ స్కాంలో ఇప్పటివరకు 8 సార్లు ఈడీ నోటీసులను కేజ్రీవాల్ బేఖాతరు చేశారు. తమ నోటీసులను కేజ్రీవాల్ బేఖాతరు చేస్తున్నారని రౌజ్ అవెన్యూ కోర్టుకు ఈడీ ఫిర్యాదు చేసింది. ఈ కేసులో ఆయనకు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. బెయిల్‌ ఇచ్చిన మరుసటి రోజే, రెండు వేరు వేరు కేసుల్లో వేరు వేరు తేదీల్లో విచారణకు రావాలని ఈడీ నోటీసులిచ్చింది. తాజాగా ఈడీ ఆఫీసులో కేజ్రీవాల్ విచారణకు హాజరవ్వడంపై ఉత్కంఠ నెలకొంది.

Tags:    

Similar News