EC: అన్ని రాష్ట్రాల అధికారులతో సీఈసీ భేటీ.. ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష

EC: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఫిర్యాదులను పరిష్కరించాలి

Update: 2024-03-11 12:18 GMT

EC: అన్ని రాష్ట్రాల అధికారులతో సీఈసీ భేటీ.. ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష

EC: సార్వత్రిక ఎన్నికల కోసం.. ఈసీ కసరత్తు ముమ్మరం చేసింది. ఎన్నికల పరిశీలకులతో సమావేశమైన..కేంద్ర ఎన్నికల సంఘం రానున్న ఎన్నికల్లో పరిశీలకులు వ్యవహరించాల్సిన తీరుపై మార్గనిర్దేశం చేసింది. ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఫిర్యాదులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించింది. ఎన్నికల పరిశీలకుల ఫోన్ నెంబర్లు, ఇమెయిల్ విస్తృతంగా ప్రచారం చేయాలని తెలిపింది. తమకు కేటాయించిన పార్లమెంటు పరిధిలోనే తిరగాలని అధికారులకు సూచించిన ఈసీ.. వీలైనన్ని ఎక్కువ పోలింగ్ కేంద్రాలు సందర్శించి సమస్యలు పరిష్కరించాలని అధికారులకు తెలిపింది.

Tags:    

Similar News