Earthquake: లఢక్‌లో భూకంపం

Earthquake: భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనాలు

Update: 2022-01-22 03:45 GMT

లఢక్‌లో భూకంపం

Earthquake: హిమాలయ పర్వత శ్రేణుల్లో మరోసారి భూమి కంపించింది. ఇవాళ తెల్లవారుజామున లడఖ్‌లోని కార్గిల్‌లో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.0గా నమోదయ్యింది. 169 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది. అర్ధరాత్రి వేళ భూమి కంపించడంతో జనాలు ఇళ్ల నుంచి పరుగులు తీశారు. మిజోరంలో కూడా భారీ భూకంపం సంభవించింది. శుక్రవారం మధ్యాహ్నం 3.42 గంటలకు రాజధాని ఐజ్వాల్‌ సహా మిజోరం అంతా భూ ప్రకంపనలు వచ్చాయి. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.6గా నమోదయ్యింది.

Tags:    

Similar News