మైసూర్లో ఘనంగా దసరా ఉత్సవాలు
మైసూర్లో దసరా ఉత్సవాలు ఘనంగా ప్రారంభయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన దసరా ఉత్సవాలను మైసూర్ మహారాజు యధువీర్ కృష్ణదత్త ఛామరాజ వడియార్ సామి పూజతో ప్రారంభించారు.
మైసూర్లో దసరా ఉత్సవాలు ఘనంగా ప్రారంభయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన దసరా ఉత్సవాలను మైసూర్ మహారాజు యధువీర్ కృష్ణదత్త ఛామరాజ వడియార్ సామి పూజతో ప్రారంభించారు. ఒడయార్ సంప్రదాయబద్ధంగా శమీ వృక్షానికి పూజలు నిర్వమించారు. సాయంత్రం జంబూ సవారీ కోసం గజరాజుల్ని అందంగా అలంకరిస్తారు. మరోవైపు రాజభవనంలో సాంస్కృతిక క్రీడా పోటీలు నిర్వహిస్తారు. 4వందల సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఈ వేడుకలు నేటికి అంతే ఉత్సాహంతో నిర్వహిస్తున్నారు. 1610వ సంవత్సంరంలో నుంచి దరసరా వేడుకలు వడయర్ రాజవంశం నిర్వహిస్తుంది. ఈ వేడుకలను తిలకించేందుకు భారత్తో ఇతర దేశాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తారు.