Droupadi Murmu: ఎన్నికల ప్రక్రియలో మహిళలు మరింతగా పాల్గొనాలి
Droupadi Murmu: 2019లో మహిళలే ఓటు హక్కు వినియోగించుకున్నారు
Droupadi Murmu: ఎన్నికల ప్రక్రియలో మరింత మంది మహిళలు పాల్గొనాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపునిచ్చారు. 13వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. 2019 ఎన్నికల్లో పురుషులు కంటే ఎక్కువ మంది మహిళలు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారని చెప్పారు. పార్లమెంటులో మహిళల ప్రాతినిధ్యం పెరగడంపైనా ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఉభయసభల్లో మహిళా ఎంపీల సంఖ్య 115కు చేరుకుందని చెప్పారు.