డీఆర్డీఓకు చెందిన డ్రోన్ కుప్పకూలింది. ఈ ఘటన కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా జోదిచిక్కెనహళ్లి పంట పొలాల్లో జరిగింది. మంగళవారం తెల్లవారుజామున చేపట్టిన ప్రయోగంలో డ్రోన్ ఎగిరిన కొద్ది నిమిషాలకే కుప్పకూలినట్టు అధికారులు తెలిపారు. అయితే అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని స్పష్టం చేశారు అధికారులు. చిత్రదుర్గ జిల్లా కేంద్రానికి సమీపంలో డీఆర్డీఓ చల్లకెరె ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ (ఏటీఆర్)ను ఏర్పాటు చేస్తోంది. కూలిన డ్రోన్ డీఆర్డీఓకు చెందిన రుస్తోం-2 డ్రోన్ అని చిత్రదుర్గ ఎస్పీ తెలిపారు. ఈ ఘటనతో షాక్ కు గురైన డీఆర్డీఓ అధికారులు సంఘటనా స్థలికి చేరుకున్నారు.