ఢిల్లీలో ధర్మపోరాట దీక్ష ప్రారంభమైంది.

Update: 2019-02-11 04:10 GMT

ఢిల్లీ వేదికగా టీడీపీ ధర్మపోరాట దీక్ష ప్రారంభమైంది. కేంద్రం తీరుకు నిరసనగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో ధర్మపోరాట దీక్ష చేపట్టారు. ఈరోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దీక్ష కొనసాగనుంది. సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు దీక్ష చేయనున్నారు. దీక్ష నేపథ్యంలో ఏపీ నుంచి ఢిల్లీకి టీడీపీ శ్రేణులను తరలించారు. కాగా ఈ ధర్మపోరాట దీక్షకు 23 పార్టీల నేతలు సంఘీభావం తెలిపాయి.

Similar News