జనతా కర్ఫ్యూ.. మెట్రో సేవలు బంద్‌

Update: 2020-03-20 11:26 GMT

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం రోజున జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపు నేపథ్యంలో ఢిల్లీ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రోజున ఢిల్లీ మెట్రో రైలు సర్వీసులను నిలిపివేయాలని నిర్ణయించింది. ప్రజలు ఇళ్లలో ఉండి జనతా కర్ఫ్యూను విజయవంతం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఢిల్లీలో ఇప్పటివరకు 17 కరోనా కేసులు నమోదయ్యాయి.



Tags:    

Similar News