Arvind Kejriwal: ప్రధాని మోడీకి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ లేఖ

* ఒమిక్రాన్ ఎఫెక్టెడ్ కంట్రీస్‌ నుంచి విమానాలు నిలిపివేయండి - కేజ్రీవాల్

Update: 2021-11-29 01:21 GMT

ప్రధాని మోడీకి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ లేఖ(ఫైల్ ఫోటో)

Arvind Kejriwal: ఒమిక్రాన్ ప్రభావిత దేశాల నుంచి విమానాలను భారత దేశానికి రానివ్వదొద్దని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఏడాదిన్నర పాటు కరోనా మహమ్మారితో దేశం గట్టిగా పోరాడిందని లక్షలాది మంది కోవిడ్ యోధుల నిస్వార్ధ సేవల కారణంగా అతికష్టం మీద కరోనా వైరస్ నుంచి దేశం కోలుకుందన్నారు. ఒమిక్రాన్ వచ్చిన నేపథ్యంలో యూరోపియన్ దేశాలు సహా అనేక దేశాలు ఈ కొత్త వైరస్ ప్రభావిత దేశాలకు ప్రయాణాలను నిలిపి వేశాయని కేజ్రీవాల్ తెలిపారు. తక్షణమే ఈ ప్రాంతాల నుంచి భారత్ కు రాకపోకలను నిలిపి వేయాలని కోరారు.

Tags:    

Similar News