తమిళనాడులో కొత్తగా 1,149 కేసులు నమోదయ్యాయి

తమిళనాడులో కరోనావైరస్ కరాళ నృత్యం చేస్తోంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1,149 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయని, వీటిలో 805 కేసులు చెన్నైలో ఉన్నాయని తమిళనాడు ఆరోగ్య శాఖ ఆదివారం మీడియా సంస్థలకు తెలిపింది.

Update: 2020-05-31 13:52 GMT

తమిళనాడులో కరోనావైరస్ కరాళ నృత్యం చేస్తోంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1,149 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయని, వీటిలో 805 కేసులు చెన్నైలో ఉన్నాయని తమిళనాడు ఆరోగ్య శాఖ ఆదివారం మీడియా సంస్థలకు తెలిపింది. అలాగే రాష్ట్రంలో కొత్తగా 757 రికవరీలు, 13 మంది మరణాలు సంభవించాయని.. తెలిపింది. ఇక కోవిడ్ -19 రోగుల సంఖ్య తమిళనాడులో 12,757 గా ఉండగా.. మొత్తం ఇప్పటివరకూ 173 మరణాలు సంభవించాయి. ఇదిలావుంటే సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకారం, భారతదేశంలో కరోనావైరస్ రోగుల రికవరీ రేటు 47.76 శాతానికి పెరిగింది, దేశంలోని కోవిడ్ -19 మరణాల సంఖ్య 5,000 దాటింది.

Tags:    

Similar News