మహారాష్ట్రలో మరో 91 మంది పోలీసులకు కరోనా

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది.

Update: 2020-05-31 07:02 GMT

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది.కొత్తగా మరో 91 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో వారందర్ని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. గత 24 గంటల్లో మరో 91 మంది పోలీసులు వైరస్సోకడంతో మహారాష్ట్ర పోలీసు విభాగంలో కరోనావైరస్ పాజిటివ్ సంఖ్య 1,421 కు పెరిగింది. మొత్తం జాబితాలో 183 మంది పోలీసు అధికారులు ఉండగా, 1,238 మంది పోలీసులు ఉన్నారు. మహారాష్ట్ర పోలీసు విభాగంలో కరోనావైరస్ కారణంగా మొత్తం 26 మంది పోలీసులు మరణించారు.

Tags:    

Similar News