Coronavirus: 14 రోజుల్లో భారీగా కేసులు, రికవరీలు
దేశంలో కరోనా ఇన్ఫెక్షన్ల సంఖ్య 90 వేల 813 కు చేరుకుంది. ఆదివారం ఒడిశాలో 91, రాజస్థాన్లో 70, అస్సాంలో 3 కేసులు నమోదయ్యాయి.
దేశంలో కరోనా ఇన్ఫెక్షన్ల సంఖ్య 90 వేల 813 కు చేరుకుంది. ఆదివారం ఒడిశాలో 91, రాజస్థాన్లో 70, అస్సాంలో 3 కేసులు నమోదయ్యాయి. మే 2 న దేశంలో సోకిన వారి సంఖ్య 39 వేల 826. అంటే, 14 రోజుల్లో సుమారు 50 వేల మంది కరోనా భారిన పడ్డారు. అదేవిధంగా, మే 2 వరకు నయం అయిన రోగుల సంఖ్య 10 వేల 852, ఇది ఇప్పుడు 34 వేల 224 కు పెరిగింది. అంటే గత 14 రోజుల్లో 23 వేల 372 మంది రోగులు నయమయ్యారు.
శనివారం, ఒక రోజులో గరిష్టంగా 4792 మంది రోగులు పెరగగా, 3979 మంది కూడా ఆరోగ్యంగా ఉన్నారు. మహారాష్ట్రలో, సోకిన వారి సంఖ్య 30 వేలు దాటింది, గుజరాత్ , తమిళనాడులలో 10,000 దాటింది. ఈ గణాంకాలు covid19india.org ,రాష్ట్ర ప్రభుత్వాల నుండి వచ్చిన సమాచారం ఆధారంగా ఉన్నాయి. దేశంలో 90 వేల 927 మంది సోకినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 53 వేల 946 మంది చికిత్స పొందుతున్నారు. 34 వేల 108 మంది నయమయ్యారు, 2872 మంది మరణించారు అని పేర్కొంది. ఇక రాష్ట్రాల వారీగా కేసులు, మరణాల సంఖ్య ఇలా ఉంది..
♦ మహారాష్ట్రలో 30,706 పాజిటివ్ కేసులు, 1,135 మంది మృతి
♦ గుజరాత్లో 10,989 పాజిటివ్ కేసులు, 625 మంది మృతి
♦ తమిళనాడులో 10,585 పాజిటివ్ కేసులు, 74 మంది మృతి
♦ ఢిల్లీలో 9,333 పాజిటివ్ కేసులు, 129 మంది మృతి
♦ రాజస్థాన్లో 4,960 పాజిటివ్ కేసులు, 126 మంది మృతి
♦ మధ్యప్రదేశ్లో 4,790 పాజిటివ్ కేసులు, 243 మంది మృతి
♦ ఉత్తరప్రదేశ్లో 4,258 పాజిటివ్ కేసులు, 104 మంది మృతి
♦ వెస్ట్బెంగాల్లో 2,576 పాజిటివ్ కేసులు, 232 మంది మృతి
♦ పంజాబ్లో 1,946 పాజిటివ్ కేసులు, 32 మంది మృతి
♦ బీహార్లో 1,178 పాజిటివ్ కేసులు, ఏడుగురు మృతి
♦ జమ్మూకశ్మీర్లో 1,121 పాజిటివ్ కేసులు, 12 మంది మృతి
♦కర్ణాటకలో 1,092 పాజిటివ్ కేసులు, 36 మంది మృతి